•  ఆపద సమయాల్లో అభాగ్యులకు ఆపన్నహస్తం
  •  

  • -కష్టాలు తెలుసుకొని మరీ స్పందించే గుణం

  • -ఎక్కడున్నా.. సమస్య ఏదైనా వెంటనే పరిష్కారం
  • -వేలాది మందికి సాయం
  • - పేదల హృదయాల్లో చెరగని ముద్ర
  • నేడు వైఎస్సార్ సీపీ నియోజ‌క‌వ‌ర్గ ర‌ధ సారధిగా మ‌రో ముండ‌డుగు 

చిల‌క‌లూరిపేట‌: 

 నువ్వు జనంలో కలిసిపోవాలి, నిత్య పోరాటమయంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి, అనునిత్యం ఆదర్శప్రాయమైన జీవితాన్ని సాగించాలి.... ఇది నాయ‌కుంటే ఎలా ఉండాల‌నే అంశంపై క‌మ్యూనిస్టు యోధుడు పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య చెప్పిన మాట‌లు. క‌మ్యూనిస్టు నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చి, అంచెలంచెలుగా ఎదిగిన నేటి వైఎస్సార్ సీపీ చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌ల్లెల రాజేష్‌నాయుడుకు అచ్చంగా అన్వ‌యించుకోవ‌చ్చు. మార్పుకు సంకేతంగా నిలిచే చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్ సీపీ ర‌ధ సార‌ధిగా నూత‌నంగా నియ‌మితులైన మ‌ల్లెల రాజేష్ నాయుడు  ప్రాంతానికి సుప‌రిచితుడే. తాత మ‌ల్లెల బుచ్చ‌య్య నుంచి అల‌వ‌డిన పోరాట‌ప‌టిమ‌. తండ్రి మ‌ల్లెల స‌త్య‌నారాయ‌ణ నుంచి అల‌వ‌డిన దాన‌గుణం, పేద‌ల ప‌ట్ల అపార‌మైన ప్రేమను పునికి పుచ్చికున్న రాజేష్‌నాయుడు రానున్న ఎన్నిక‌ల్లో వైఎస్సార్ సీపీ  త‌రుఫున బ‌రిలో నిల‌వ‌నున్నారు. 

చ‌దువే పెట్టుబ‌డి... 

ఇతనెవ‌రు..?  మీ బాబా ?

 ప‌ది సంవత్స‌రాలు కూడా నిండ‌ని చిన్నారి చూసి అత‌ని తండ్రిని ప్ర‌శ్నించాడు రాజేష్‌నాయుడు. 

అవున‌య్యా.. మీతో చెప్పి ప‌నిలో పెద‌డామ‌ని తెచ్చాయ‌న్నా ..కొడుకు ద‌గ్గ‌ర‌కు తీసుకుంటూ చెప్ప‌డ‌త‌ను. 

చ‌దువు చెప్పించ‌టం లేదా..సంశంతో ఆగాడు

లేద‌య్య‌.. మాలాంటి వాళ్ల‌కు చ‌దువు చెప్పించ‌టం క‌ష్ట‌మ‌య్యా.. వీడు కూడా ఏదైనా ప‌నిచేసి ప‌దో ప‌ర‌కో సంపాదిస్తే ..ఆసరా ఉంటుంద‌ని.. ఆగాడు. 

ఆ చిన్నారిని ద‌గ్గ‌ర‌కు పిలిచాడు రాజేష్ నాయుడు ,.. చ‌దువుకుంటావా.. నేను చ‌దివిస్తా...పుస్త‌కాలు, బ‌ట్ట‌లు కూడా కొని ఇస్తా .. అభ‌య‌మిచ్చాడు. 

తండ్రి ఏం చెబుతోడో అని భ‌య,భ‌యంగా చూసాడు. నేనున్నాంటూ భ‌జం త‌ట్టాడు.  ఈ పంఘ‌ట‌న ఆ చిన్నారి జీవితంలో కొత్త వెలుగులు నింపింది. చ‌దువు ప్రాముఖ్య‌త తెలిసిన రాజేష్ నాయుడు త‌న వ‌ద్ద ప‌నిచేసే ప్ర‌తి ఒక్క‌రి పిల్ల‌లు చ‌దువుకోవాల‌ని ఆకాంక్షిస్తాడు. ఇలా మొద‌లైన మ‌ల్లెల రాజేష్ నాయుడి విద్యాసేవా ప్ర‌స్థానం వేలాది మందికి చేయూత‌నందిస్తుంది. చ‌దువే పెద్ద పెట్టుబ‌డిని, జీవితంలో ప్ర‌తి ఒక్క‌రూ చ‌దువుకోవాల‌ని ఆయ‌న త‌ప‌న‌.ఆర్థిక ఇబ్బందులతో  పేద విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేసి కూలీలుగా మారుతున్నరన్న విషయం గ్రహించి  అందరికి నాణ్యమైన విద్యను అందించేందుకు న‌డుం బిగించాడు. 

ఎంఆర్ ఫౌండేష‌న్ ద్వారా సేవా ప్ర‌స్థానం.. 

సాయం.. చదివితే రెండు అక్షరాలే కావొచ్చు. కానీ అందిస్తే.. దాని విలువ జీవితాంతం. అందుకే కష్టాల్లో ఉన్నవారికి బాసటగా నిలిచిన వారు దేవుళ్లుగా కనిపిస్తారు. సాయం చేసే తత్వం అతి కొద్ది మందికే సాధ్యం. ఎదుటి వ్యక్తుల బాధను తమ కష్టంగా భావించే గొప్ప మనసు కావాలి. ఉన్నదాంట్లో కొంత అందించి అండగా నిలిచే హృదయం ఉండాలి. అలాంటి కోవకే చెందిన వ్య‌క్తే రాజేష్‌నాయుడు. ఎంఆర్ ఫౌండేష‌న్ ద్వారా ప్రజల కష్టాలు, కన్నీళ్లలో తోడుగా.. ఆపదొస్తే అండగా ఉంటున్నారు రాజేష్ నాయుడు. విద్యా, వైద్యం, ఆర్థిక ఇబ్బందులు,  కష్టాలు ఇలా సమస్య ఏదైనా, తెలియగానే స్పందిస్తున్నారు. తనకు నేరుగా విన్నవించినా.. లేదా సోషల్ మీడియాద్వారా చేరవేసినా వెంటనే భరోసా ఇస్తున్నారు. అత్యవసరసమయాల్లో ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్నారు.  వేలాది మంది అభాగ్యులకు తన సహాయాన్ని అందించి జనం గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తున్నారు. వారందరి దీవెనలతో మరింత ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. ఎన్నో గుప్త దానాలు చేసిన మ‌ల్లెల ఆధ్యాత్మిక సేవ‌లోనూ ముందంజ‌లో ఉన్నారు. అనేక శిధిల‌మైన దేవాల‌యాల పున‌రుద్ద‌ర‌ణ, వినాయ‌క చ‌వితి , ద‌స‌రా త‌దిత‌ర పండుగ‌ల ఉత్స‌వాల‌కు ఇతేధికంగా స‌హాయం అందించేవారు. ప్ర‌స్తుతం త‌న‌కు ల‌భించిన వైఎస్సార్ సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ప‌ద‌వి కూడా పేద‌ల‌కు మరింత సేవ చేసే ప‌ద‌విగా భావిస్తున్నారు.

కుటుంబ నేప‌థ్యం ...

మ‌ల్లెల రాజేష్ కుటుంబం యావ‌త్తు ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌టంలో ముందున్నారు.  రాజేష్‌నాయుడు  తాత మల్లెల బుచ్చయ్య  చిలకలూరిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గా, కొమరవల్లిపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా కొన‌సాగారు. తండ్రి మల్లెల సత్యనారాయణ మున్సిపల్ కౌన్సిలర్ గా , కాపు సంఘం నాయకుడిగా, మ‌ల్లెల బుచ్చ‌య్య చారిట‌బుల్ ట్ర‌స్ట్ నిర్వాహ‌కుడిగా కొన‌సాగారు.  వీరిది ముందు  రాజ‌కీయ కుటుంబం. మల్లెల రాజేష్ నాయుడు  తండ్రి మరణానంతరం ఆయ‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తూ ప్రస్తుతం ఏపీఎస్ఐడీసీ డైరెక్టర్ గా కొన‌సాగుతున్నారు. గ‌తం నుంచి వీరి కుటుంబం యావ‌త్తు పేద‌ల ప‌క్ష‌పాతిగా ఉంది. దీంతో వీరికి ప్ర‌జాబ‌లం కూడా ఎక్కువే.  రాజేష్ నాయుడు అడుగు పెట్టిన ప్ర‌తి చోట జ‌న‌సందోహం క‌ట్ట‌లు తెంచుకుంటుంది.ఇంత‌టి ప్ర‌జా ఆద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిని వైఎస్సార్ సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ఎంపిక చేయ‌డం స‌ముచిత నిర్ణ‌య‌మ‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. 

Axact

చిలకలూరిపేట న్యూస్

నిజం.. నిష్పక్షపాతం మా నైజం నిగ్గు తేల్చే నిజాల కోసం.. నిక్కచ్చైన విశ్లేషణల కోసం

Post A Comment:

0 comments: