మృత్యు ఘంటికలు మ్రోగుతున్నాయ్...కాళ్ళులేని చెప్పులు నడుస్తున్నాయ్ ..దేహం లేని చొక్కాలు కదులుతున్నాయ్ ... అన్న కవి మాటలు నిజం చేస్తూ... ఏవరో గుర్తుతెలియని మనిషి పట్టణంలోని అడ్డరోడ్డ సెంటర్లో కళ్యాణి బార్ అండ్ అండ్ రెస్టారెంట్ ఎదుట మురుగు కాల్వలో శవమై తేలాడు. 2016 అక్టోబర్ 23వ తేదీ పట్టణంలోని పీరు సాహెబ్ వీధిలో అభం శుభం తెలియని ఏడాదిన్నర చిన్నారి షేక్ సోహెల్ ఆడుకుంటూ వెళ్లి మురుగుకాల్వలో పడి అశువులు బాసాడు. ఉన్న కాల్వల్లో మురుగు కదలదు. శిధిలమైన డ్రైన్ల నిర్మాణం ముందుకు సాగదు.
ఇంకెన్ని ప్రాణాలు పోవాలి...?
పట్టణాన్ని సుందవనంగా తీర్చిదిద్దాం.. అన్ని వాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాం... అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు కావు ఇప్పడు కావల్సింది. పట్టణంలోని ప్రధాన కాల్వల దుస్థితికి కారణమెవ్వరు..? చిలకలూరిపేట మున్సిపాలిటిగా అవతరించి 50 సంవత్సరాలు నిండాయి. గ్రేడ్ -1గా ఉన్న పట్టణంలో రోజుకు 80 లక్షల మురుగునీరు విడదలౌతుంది. పట్టణంలోనూ, అవసరమైతే నిధులు ఖర్చుపెట్టడానికి పొలాల్లోనూ కాల్వలు నిర్మించి ఎవరికివారు బేష్ అంటూ తమకు తామే భూజాలు చరుకుకొనే పెద్దలు అస్థవ్యస్థ డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దటంలో వైఫలం చెందారు.
పట్టణంలోని అంతర్గత కాల్వల నిర్మాణం ఒకే కాని ఆ కాల్వల ద్వారా వచ్చే మురుగునీరు బయటకు వెళ్లే మార్గం ఉందా అనే విషయంలో వైఫల్యం చెందారు. పట్టణంలోని ప్రధాన కాల్వలు ఏళ్ల నాడే శిదిలావస్తకు చేరాయి. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ప్రధాన డ్రైన్లు ఏళ్లనాడే వాటి రూపు కోల్పాయాయి. ఇది ఇలా ఉంటే పట్టణంలో ఉన్న 13 ప్రధాన కాల్వలు సైతం ఆక్రమణకు గురియ్యాయి. అంటే ఈ ప్రాంతంలో కనీసం పూడికలు తీయలేని పరిస్థితి ఉంది. ఏ అధికారి యైనా కొంచెం ముందుకు అడుగు వేసినా రాజకీయాల వత్తిడిలు ఏలాగు ఉంటాయి. మన దౌర్బగ్యం ఏమిటంటే మంచి చేయటానికి ఏ రాజకీయపార్టీ నాయకుడు ముందుకు రాదు. ప్రజలరా అలోచించండి ..ఇంకెన్ని ప్రాణాలు పోవాలి..



Post A Comment:
0 comments: