Published from Blogger Prime Android App

జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ అధినేత షేక్ జాన్ సైదా యడ్లపాడు మండలం, కొండవీడు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిన కుటుంబీకులకు పరామర్శించిన పిదప 20 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.సోమవారం రాత్రి యడ్లపాడు మండలం కొండవీడులో సిలిండర్ లీకై ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమైన సంఘటన జరిగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివసించే కట్టా సురేష్ భార్య రాత్రి 8:30 గంటల సమయంలో వంట చేసేందుకు సమాయత్తం అయింది. లైటర్ ముట్టించే ప్రయత్నం చేయగా,అప్పటికీ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా ఇల్లంతా మంటలు వ్యాపించాయి.అప్పటికే ఇంట్లోని టీవీ, మంచాలు, దుస్తులు, గృహోపకరణ వస్తువులతో పాటు ఆధార్, రేషన్, విద్య సంబంధిత సర్టిఫికెట్లు కాలిపోయాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా యుగ్నేశ్వర రెడ్డి ,గుంటూరు జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ బి వి రెడ్డి , భాస్కర్ రెడ్డి , పోతరం బాషా మేస్త్రి, 15వ వార్డు కౌన్సిలర్ జాలాది సుబ్బారావు , కొండవీడు సర్పంచ్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు...
Axact

చిలకలూరిపేట న్యూస్

నిజం.. నిష్పక్షపాతం మా నైజం నిగ్గు తేల్చే నిజాల కోసం.. నిక్కచ్చైన విశ్లేషణల కోసం

Post A Comment:

0 comments: